Thursday, 13 February 2025

సవితృ ధ్యానం - సంధ్యావందనం

 ఋగ్వేదంలో అన్నింటికి ఆధారభూతమైన సవితృని (4.54.4;; 2.38.9)  ప్రతిదినము 3 మార్లు ధ్యానిస్తే, ఇంద్రుడు, సింధు, ఆదిత్యులతో కూడిన అదితి, సాధకునికి రక్షణ కల్పిస్తారు, అని ఉంది.

ఋగ్వేదం 4.54.6

ఋషి వామదేవ ఋషి

 

యే తే త్రిరహన్త్సవితః సవాసో దివేదివే సౌభగమాసువన్తి  

ఇన్ద్రో ద్యావాపృథివీ సిన్ధురద్భిరాదిత్యైర్నో అదితిః శర్మ యంసత్  

------

ఇక్కడ  సవితృని  ప్రతిదినము 3 మార్లు ధ్యానించడం గురించి వామదేవ ఋషి చెబుతున్నారు.

దీనికిప్రతిదినము 3 మార్లు చేసే సంధ్యావందనానికి తేడా ఉంది.

------

సవితృని  ప్రతిదినము 3 మార్లు ధ్యానించడమంటే, మానసిక ధ్యానమేకానీ భౌతికమైన కర్మకాండకు సంబంధంలేదు

 

ప్రతిదినము చేసే సంధ్యావందనములో  తప్పనిసరిగ నీటితో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సావిత్రీ మంత్రజపం ఉంటుంది.   


------

రామాయణంలో కూడా, శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్ర ఋషి ప్రేరితులై  సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సావిత్రీ మంత్రజపం ఉంటుంది.

 

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ || -౨౩-

 

తస్యర్షేః పరమోదారం వచః శ్రుత్వా నరోత్తమౌ |

స్నాత్వా కృతోదకౌ వీరౌ జేపతుః పరమం జపమ్ || -౨౩-

No comments:

Post a Comment