ఋగ్వేదం 4.26.4లో ఒక దివ్యమైన పక్షి సోమం (అమృతం) మానవుడైన మనువు కు అందించినట్లు ఉంది.
ప్ర సు ష విభ్యో మరుతో విరస్తు ప్ర శ్యేనః శ్యేనేభ్య ఆశుపత్వా ।
అచక్రయా యత్స్వధయా సుపర్ణో హవ్యం భరన్మనవే దేవజుష్టమ్ ॥
ఓ మరుత్తులారా,చక్కటి రెక్కలుగల,రథం అవసరం లేని, ఇతర గ్రద్దలకంటే వేగంగా ఎగిరే గ్రద్ద, తన స్వతంత్ర శక్తితో మనువుకు దేవతలకు ప్రీతికరమైన నైవేద్యాన్ని తెచ్చింది.
------
పురాణాలలో వివరించిన మనువు చరిత్ర ప్రక్కన పెడితే, మనువు అంటే ఆధ్యాత్మిక ఉన్నతిని చేరిన జ్ఞాని అనే అర్థం కూడా ఉంది.
అంటే మానవులలొ మొదటిసారి జ్ఞాని స్థాయిని పొందినవాడు మనువు అని అనుకోవచ్చును.
----
ఋగ్వేదం 10.14.2 లో ఆధ్యాత్మిక మార్గాన్ని మొదట కనుగొన్న వ్యక్తి యముడు అని ఉంది. ఆ మార్గంలోనే ఆ తరువాత వచ్చిన జ్ఞానులు పయనించారు అని ఉంది.
యమో నో గాతుం ప్రథమో వివేద నైషా గవ్యూతిరపభర్తవా ఉ ।
యత్రా నః పూర్వే పితరః పరేయురేనా జజ్ఞానాః పథ్యా అను స్వాః ॥
యమడు మొదట మనకు మార్గాన్ని కనుగొన్నాడు: ఈ పచ్చిక-భూమి తీసివేయబడదు. మన పూర్వీకులు ఏ మార్గంలో వెళ్లిపోయారో, అదే మార్గంలో అప్పటి నుండి జన్మించిన వారి స్వంత మార్గాల్లో అనుసరిస్తున్నారు.
అంటే తరువాత గ్రంథాలలో మృత్యుదేవుడిగా వర్ణించబడ్డ యముడు, మానవులలొ మొదటిసారి జ్ఞాని స్థాయిని పొందిన మనువు ఒక్కరే అయి ఉండాలి.
------
అందుకనే ఏమో, కఠోపనిషత్తులో నచికేతుడికి జ్ఞాన ఉపదేశం యముడే చేస్తాడు.
No comments:
Post a Comment