శ్రీకృష్ణుడు గీతలో కర్మయోగం గురించి చెప్పాడు.
కర్మయోగం అంటేనే కర్మలు చేస్తూండాలి కానీ వాటి ఫలం ఆశించరాదు అని.
ఎంత ఆలోచించినా, ఒక సాధకుడు తనంత తానుగా ప్రయత్నిస్తే, కర్మయోగంతో ఎలా జీవించగలడో అర్థం కాలేదు.
--
శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో ఇలా అంటాడు.
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।
ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.
---
అభ్యాసము మరియు వైరాగ్యము అనేవి చదవడానికి, వినడానికి బాగుంటాయి. ఆచరణలోకి వచ్చేసరికి, అప్పటివరకు ఫలమాసించి కర్మలు చేసినవాడిని, ప్రారబ్ధరూపంలో వచ్చే సుఖదు:ఖాలు ఆ జీవిని బంధించి, కోపంతోనో/ద్వేషంతోనో/ప్రేమతోనో/అభిమానంతోనో/అసూయతోనో కర్మలు చేసేటట్లుగా ప్రేరేపిస్తూంటే, ఫలమాసించకుండా కర్మలు ఎలా చేయగలడు?
ఆ విధంగా ఫలమాసించకుండా కర్మలు చేయాలంటే, ఆత్మసాక్షాత్కారం పొందిన జ్ఞానికి మాత్రమే సాధ్యం లేదా ఆరకంగా కర్మలు చేయడానికి భగవంతుడే సాయం చేయాలి. అంటే ఆరకమైన కర్మనిష్ఠను భగవంతుడే ప్రసాదించాలి.
ఇప్పటివరకు ఇదే నా అభిప్రాయం.
----
చిత్రంగా, నా అభిప్రాయాన్ని సమర్థించే ఋగ్వేదంలోని ఒక ఋక్కు నా కంట పడింది.
ఋగ్వేదం 10.80.1
అగ్నిః సప్తిం వాజమ్భరం దదాత్యగ్నిర్వీరం శ్రుత్యం కర్మనిష్ఠామ్ ।
“అగ్ని (తనను ఆశ్రయించినవాడికి) జ్ఞానాన్ని సంపాదించే వేగం ఇస్తాడు, అగ్ని (అతనికి) పరాక్రమాన్ని, దానికి కావలసిన కర్మనిష్ఠను ఇస్తాడు;
No comments:
Post a Comment